Loading...

కుర్చీలు టేబుళ్లు సోఫాలను జగన్ ఎత్తుకుపోయారు : నారా లోకేశ్

ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రజలు దించేసినా.. నిస్సిగ్గుగా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలను జగన్ ఎత్తుకుపోయారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నారని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ‘ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద్ రావు ఇదే లేఖ రాస్తే...ఎంత అమానవీయంగా ప్రవర్తించారో జగన్ గుర్తు తెచ్చుకోవాలి. జగన్ దా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి దోచేశారు' అని లోకేశ్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ అంశంపై సాధారణ పరిపాలన విభాగానికి వైకాపా ప్రధానకార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాసిన లేఖపై లోకేశ్ ఈ విధంగా స్పందించారు.