Loading...

కోలాహలంగా ఆస్టిన్ జనసేన విజయోత్సవ వేడుకలు

ఆస్టిన్, టెక్సాస్ (అమెరికా): జనసైనికులతో ఆస్టిన్ హోరెత్తింది. ఆస్టిన్  ఎన్నారై జనసైనికులు జూన్ 9న జనసేన విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. వచ్చే 2029 నాటికి జనసేనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఈ సభ తీర్మానించింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రాష్ట్రాభివృద్ధికి నడుంకట్టిన పవన్ కల్యాణ్ కు అండగా నిలవాలని నిర్ణయించింది. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అనూహ్య విజయాన్ని సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను జనసేన ఎన్.ఆర్.ఐ. విభాగం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపింది. 

జనసేన విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర మరువలేనిది. ఆస్టిన్ జనసైనికులు జనసేన పార్టీ విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. కొందరు సొంత వూర్లుకి వెళ్లి ఓట్లు వేశారు. మరికొందరు టీమ్స్ గా ఏర్పడి ఆయా నియోజకవర్గాలకు కావలసిన మెటీరియల్స్, ఆర్ధిక వనరులు సమకూర్చి జనసేన విజయానికి పాటుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా జనసేన విజయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. అందులో భాగంగానే ఆస్టిన్ లో విజయోత్సవ సభ జరిగింది.

ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన ఆస్టిన్‌ జనసైనికులందరికీ చాలా కృతజ్ఞతలు.…తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాలంటీర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు గిరిధర్ అమరపిని , ప్రసాద్ చిలిగిలిశెట్టి, మేఘన మద్దెల, హరి పడాల, నాగ యర్రంశెట్టి, సాంబ సూరా, రామ్ యెనుముల, రమేష్ అడపా, దిలీప్ రామిశెట్టి, సునీల్ తోలేటి, శ్రీనివాస్ కుంచె తదితరులు.

----> జనసేన ఆస్టిన్ టీమ్  <----