Loading...

ఇసుక ఉచితం ; చంద్రబాబు

వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.  బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.    ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, 'ఇసుకను ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశాం. రాష్ట్రంలో అనేకచోట్ల వాగులు, వంకలు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా, ఎవరైనా తమ సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుకను తవ్వుకొని తీసుకువెళ్లవచ్చు   ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లతో రవాణా చేసుకోవచ్చు. వాటిని ఎవరూ ఆపరు. దానికి ఏ అనుమతి అక్కర్లేదు. ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పాటిస్తాం. లారీలకు టన్నుల పరిమితి లేదు. వాటి సామర్ధ్యాన్ని బట్టి అనుమతి ఇస్తాం. ఇకపై ఇసుక తక్కువ ధరకు లభించాలి. పది రోజుల్లో ఈ తేడా కనిపించాలి    ఎవరైనా ఇసుకను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే ఊరుకొనేది లేదు. ఆన్లైన్ బుకింగ్ విధానం కొనసాగుతుంది' అని పేర్కొన్నారు. వాగులు, వంక నుంచి ప్రజలు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్తుంటే పోలీ సులు ఆపి, జరిమానా విధిస్తున్నారని మంత్రి డీవీబీ స్వామి ఫిర్యాదు చేశారు. నదుల్లో ఇసుక లోడింగ్ కు కొంతమంది బాగా తక్కువ ధరకు టెండర్లు వేశారన్న ఫిర్యాదులపై కూడా చర్చించారు. ఇలాంటి వారివద్ద డిపాజిట్ భారీగా తీసుకోవాలని, చేయలేకపోతే ఆ డిపాజిట్ను జప్తు చేయా లని సీఎం సూచించారు. ఏ ఊళ్లో ఇసుకను ఆ ఊరివాళ్లే తీసుకోవాలన్న నిబంధన లేదన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలన్నారు.