Loading...

రాష్ట్రానికి భారీ వర్ష సూచన ముందస్తు జాగ్రత్త చర్యల్లో హోం మంత్రి అనిత


సోమవారం నుంచి మూడు రోజుల పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి వరద ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్నిర్వహించారుపిడుగులు పడే ప్రమాదం ఉందని, వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెలకాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, జలవనరులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సమన్వయంతో పని చేయాలని సూచించారు.

 
నేడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడొచ్చు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.