Loading...

సార్వత్రిక ఎన్నికలలో NDA కూటమి అద్భుతమైన విజయానికి ఆప్త టీం హర్షం వ్యక్తం - చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు పురందరేశ్వరి లకు శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో  అఖండ విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కి ఆప్త టీమ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఇది ఏపీ ప్రజల విజయమని పేర్కొన్నారు.

ఎన్డీఏ (National Democratic Alliance) కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్  ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలనే ఆకాంక్షను ఆప్త (American Progressive Telugu Association) వ్యక్తం చేసింది.

ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా అందరూ కలిసి మెలసి ఒకరికొకరు సహకరించుకుంటూ వృద్ధి సాధించాలనే సదుద్దేశ్యంతో ఆప్త సంస్థ తన సేవలందిస్తున్నదని ఆప్త అధ్యక్షులు త్రినాధ్ ముద్రగడ గారు , ఆప్తా బోర్డ్ చైర్ డా. సూర్యనారాయణ సీరం గారు మరియు ఆప్త లీడర్షిప్ టీం వివరించారు.

3వ సారి భారత ప్రధాని అయిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆప్తా బృందం శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిన కూటమి సారధి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు "గేమ్ ఛేంజర్ " గా, 100 శాతం స్ట్రైక్ రేట్ తో మాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆప్త ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఆప్త USAలోని NRIలకు సేవలందించే లాభాపేక్షలేని సంస్థ ప్రధానంగా నెక్స్ట్‌జెన్, ఉమెన్ ఎంపవర్‌మెంట్, మ్యాట్రిమోనీ సర్వీసెస్, టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్, యువతకు కెరీర్ అవకాశాలు, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, బిజినెస్ ఫోరమ్‌లు మరియు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మొదలైన కార్యక్రమాలను నిర్విరామంగా గత 15 సంవత్సరాలనుంచి కొనసాగిస్తున్న గొప్ప సంస్థ.

ఆప్తా గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేయండి - https://ap-ta.org/