Loading...

రతన్ టాటా బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు

టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతని వయస్సు 86. నివేదికల ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా  రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయిన కారణంగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు.    అక్టోబర్ 7 న, సోషల్ మీడియా పోస్ట్‌లో, తన 86 ఏళ్ల ఆరోగ్య సమస్యలను 'పుకార్లు' అని కొట్టిపారేశారు మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరియు వయస్సు సంబంధిత వైద్య పరిస్థితుల కోసం అతను తనిఖీలు చేస్తున్నానని తన అనుచరులకు మరియు అభిమానులకు తెలియజేశాడు.    కానీ 9వ తేది రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.   

పార్సీ ఆచారాల పద్దతి లో  అంత్యక్రియలు నిర్వహిస్తారా. లేదా   హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు  కంటే భిన్న మైన ఆచారం   ఈ పార్శి ఆచారం  రతన్ టాటా డెడ్ బాడీని రాబందులకి అప్పగిస్తారా ;  

రతన్ టాటా భౌతికకాయాన్ని కోల్బాలోని ఆయన ఇంటికి తరలించారు. ఆయన భౌతికకాయాన్ని ఈ రోజు (గురువారం) వర్లీ శ్మశానవాటికకు తరలించనున్నారు. అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించనున్నారు. ప్రస్తుతం పార్సీ ఆచారాల ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.    పార్సీలు హిందువులలాగా తమ బంధువుల మృతదేహాలను దహనం చేయరు. ముస్లింలు, క్రైస్తవులలాగా శవ పేటికల్లో పెట్టి పాతిపెట్టరు. వీటన్నిటికి భిన్నంగా పార్సీల అంత్యక్రియలు ఉంటాయి. ఈ సంప్రదాయం 3 వేల సంవత్సరాల నాటిది. పార్సీల స్మశానవాటికను దఖ్మా లేదా టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. టవర్ ఆఫ్ సైలెన్స్ వృత్తాకార బోలు భవనం రూపంలో ఉంటుంది    పార్సీల్లో ఎవరైనా మరణిస్తే.. వారు మరణించిన అనంతరం వారి భౌతిక కాయాన్ని శుద్ధి చేసే ప్రక్రియను నిర్వహిస్తారు. అనంతరం వారి మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు. పార్సీల అంత్యక్రియల ప్రక్రియను దోఖ్మెనాషిని అంటారు. ఇందులో మృత దేహాలను ఆకాశంలో ఖననం చేస్తారు   అంటే.. మృతదేహాన్ని సూర్యరశ్మికి, మాంసాహార పక్షులకు ఆహారంగా బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు. అంటే మరణించిన తర్వాత కూడా జీవితంలో చివరి దాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించడమే.. ఈ రకమైన అంత్యక్రియలు నిర్వహించడంలో గల ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. అంతేకాదు పార్సీ తరహాలోనే బౌద్ధ మతానికి చెందిన వారు కూడా ఇలాంటి అంత్యక్రియలను నిర్వహిస్తారు. మృత దేహాన్ని కూడా రాబందులకు అప్పగిస్తారు.

JRD టాటా పునాది వేశారు ; 

ముంబైలో పార్సీలకు ప్రత్యామ్నాయ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మొదటి ప్రార్థన మందిరానికి 1980లలో ప్రముఖ పారిశ్రామికవేత్త JRD టాటా (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా) పునాది వేశారు. పార్సీల అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసే ప్రార్థనా మందిరం.   1980వ దశకంలో JRD టాటా సోదరుడు BRD టాటా మరణించిన తర్వాత…JRD టాటా ముంబై మున్సిపల్ కమిషనర్ జంషెడ్ కంగాను సంప్రదించిన ఆయన తన సోదరుడి అంత్యక్రియలకు ముంబైలోని ఏ శ్మశానవాటిక మంచిదని అడిగారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో పలువురు ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అప్పట్లో కొన్ని శ్మశాన వాటికలు మూతపడగా.. వాటిల్లో కొన్ని అప్‌గ్రేడ్ చేశారు. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దాదర్‌లోని శ్మశానవాటికను శుభ్రం చేశారు. అయితే సోదరుడి మరణంతో దుఃఖంలో ఉన్న JRD టాటాను ఓదార్చడానికి జంషెడ్ కంగా అక్కడికి వెళ్లినప్పుడు.. ముంబైలోని శ్మశానవాటికలో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని JRD టాటా చెప్పారు   ముంబైలోని వర్లీలో ఉన్న శ్మశానవాటికలో చాలా స్థలం ఉంది. ఇది పార్సీలకు కూడా సౌకర్యంగా ఉండేది. వర్లీలోనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని జంషాద్ కంగా భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే ఆయన బదిలీ అయ్యారు. అప్పటికీ జంషెడ్ కంగా ఈ మిషన్‌ను వదిలిపెట్టలేదు. ముంబైలోని ప్రభావవంతమైన పార్సీల సహకారంతో.. వీరి అంత్యక్రియలకు ప్రత్యామ్నాయ పద్ధతిని కోరుతూ ‘డిస్పోజ్ ఆఫ్ ది డెడ్ విత్ డిగ్నిటీ’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పుడు జంషాద్ కంగా మాట్లాడుతూ- ‘టవర్ ఆఫ్ సైలెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు.. కనుక మాకు ప్రత్యామ్నాయం కావాలని కోరారు    జంషాద్ కంగా డిమాండ్ తో పార్సీల కోసం శ్మశాన వాటికను నిర్మించాలనే డిమాండ్ ఊపందుకుంది. టవర్ ఆఫ్ సైలెన్స్ సమీపంలో శ్మశానవాటికను నిర్మించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయ్తీ పార్సీల అతిపెద్ద ప్రతినిధి సంఘం.. బొంబాయి పార్సీ పంచాయితీ అంటే BPP దీనిని అంగీకరించలేదు. టవర్ ఆఫ్ సైలెన్స్ ద్వారా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపిన వారికి మాత్రమే అక్కడ నిర్మించిన ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేసేందుకు అనుమతించారు. అయితే పార్సీల మృతదేహాలను వేరే చోట పూడ్చిపెట్టిన లేదా దహనం చేసిన వారిని సైలెన్స్ టవర్ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. మిగిలిన చోట్ల, మృతదేహాలను పూడ్చిపెట్టిన, దహనం చేసిన ఇద్దరు పార్సీ పూజారులను కూడా తమ ప్రార్థనా మందిరాల్లో అడుగు పెట్టరాదంటూ నిషేధించారు. దీని తర్వాత 2015లో మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి పార్సీల సమూహం ముంబైలోని వర్లీలో పార్సీల కోసం శ్మశానవాటికను నిర్మించింది.      

రతన్ టాటా జీవితానికి సంబంధించిన ఈ 10 వాస్తవాలు 

  డిసెంబర్ 28, 1937న ముంబ‌యిలో రతన్ టాటా జననం    తల్లిదండ్రులు విడిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగిన వ్యాపార దిగ్గజం  నాలుగు సందర్భాల్లో పెళ్లికి దగ్గరగా వెళ్లినప్పటికీ చేసుకోని వైనం    1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించిన రతన్ టాటా   విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా మారిన భారత పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం,    దాతృత్వానికి మారుపేరు అయిన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్‌ టాటా ఇకలేరనే విషయం తెలిసిందే.   బుధవారం రాత్రి ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను మననం చేసుకుందాం 

 1 .  టాటా గ్రూప్‌ను స్థాపించిన జమ్‌సెట్‌జీ టాటా మునిమనవడే రతన్ నావల్ టాటా. డిసెంబర్ 28, 1937న ఆయన జన్మించారు. ముంబ‌యిలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు.                

 2. 1948లో రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సోనీ టాటా విడిపోయారు. దీంతో తన అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్ టాటా పెరిగారు.        
 3 . రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. నాలుగు సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి దగ్గరగా వెళ్లారు కానీ చేసుకోలేదు.
 4 . లాస్ ఏంజెల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డానని రతన్ టాటా ఒక సందర్భంలో అంగీకరించారు. కానీ 1962 ఇండో-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్ పంపించడానికి నిరాకరించారట.  

5 . 1961లో రతన్ టాటా కెరియర్ ప్రారంభించారు. టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో కార్యకలాపాలను మొదలుపెట్టారు. ఈ అనుభవం ఆయనను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దింది.

6. తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూప్ చైర్మన్‌గా 1991లో బాధ్యతలు స్వీకరించారు. 2012 వరకు గ్రూపును నడిపించారు.

7 . భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ సమయంలో టాటా గ్రూపును ఆయన పునర్వ్యవస్థీకరించడం మొదలుపెట్టారు. టాటా నానో, టాటా ఇండికాతో సహా ప్రముఖ కార్లను కంపెనీ ఉత్పత్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

8 . టెట్లీని దక్కించుకునేందుకు టాటా టీని, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ కోసం టాటా మోటార్స్‌ను, కోరస్‌ కోసం టాటా స్టీల్‌ను రతన్ టాటా కొనుగోలు చేశారు.

 9. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును మధ్యతరగతి వారికి అందుబాటులోకి తీసుకొస్తానని 2009లో రతన్ టాటా మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చుకున్నారు. టాటా నానో కారును రూ.1 లక్ష ధరకు మార్కెట్‌లో ఆవిష్కరించారు. సరసమైన ధరకు చిహ్నంగా ఈ కారు నిలిచింది. 
 10 . పదవీవిరమణ తర్వాత టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌కు ‘గౌరవ చైర్మన్’ బిరుదును అందించారు.